Revanth Reddy resignation letter of MLA post is still at AP CM Chandrababu Naidu, is it strategical?
తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి లేఖ ఇంకా స్పీకర్ కు చేరలేదని తెలుస్తోంది. స్పీకర్ ఫార్మాట్ లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ.. ఆ లేఖ ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు వద్దనే ఉన్నట్టు సమాచారం.
అమరావతిలో చంద్రబాబును కలిసిన సందర్భంగా రేవంత్ తన రాజీనామా లేఖను అందజేశారు. లేఖను నేరుగా స్పీకర్ కు పంపించకుండా చంద్రబాబుకు అందజేసి రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఆ లేఖను తిరిగి తెలంగాణ స్పీకర్ కు పంపిస్తారా? లేరా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నవంబర్ 2 వరకూ తన వద్దే రేవంత్ రాజీనామాను ఉంచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం హైదరాబాద్ కు వచ్చి తెలుగుదేశం నేతలతో సమావేశమై, రేవంత్ విషయమై ఓ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. తెలంగాణకు చెందిన టీడీపీ నాయకుల ద్వారా రేవంత్ రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపించే అవకాశాలున్నాయి.