In order to strengthen friendly ties and promote mutual understanding, the Government of Andhra Pradesh and the Canton of Zurich signed a letter of intent, which also aims to achieve mutual prosperity and development.
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం అవుతున్నారు. స్విట్జర్లాండ్లో అడుగు పెట్టగానే పెట్టుబడుల వేట మొదలు పెట్టిన చంద్రబాబు స్విట్జర్లాండ్కు చెందిన ‘పయనీర్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పయనీర్ వెంచర్స్ సుముఖత వ్యక్తం చేసింది. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ కేంద్రంగా పనిచేసే పయనీర్ సంస్థ.. వ్యవసాయ, వ్యవసాయాధారిత సప్లై చైన్ బిజినెస్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. జ్యూరిచ్లో పయనీర్ వెంచర్స్ చైర్మన్ రియాన్ పాల్, చీఫ్ ఇన్వె్స్టమెంట్ ఆఫీసర్ సందీప్ రాజ్తో సీఎం బృందం భేటీ అయింది. ఆ భేటీ లో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జ్యూరిచ్, ఆంధ్రప్రదేశ్ నడుమ సిస్టర్ స్టేట్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అనుసరించి పర్యావరణ సాంకేతికత, జీవశాస్త్రాలు, పట్టణప్రాంత అభివృద్ధి రంగాల్లో జ్యూరిచ్, ఏపీ పరస్పరం సహకరించుకుంటాయి.