Surprise Me!

మోడీపై విశ్వాసం ఉంటే రాజీనామాలు, అవిశ్వాసం ఎందుకు ?

2018-03-12 728 Dailymotion

Tdp chief Chandrababu Naidu ordered to party leaders to continuing protest in parliament for Ap special status. Chandrababu naidu conducted teleconference on Monday morning.

ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పార్లమెంట్‌లో పోరాటం కొనసాగించాలని టిడిపి ఎంపీలకు చంద్రబాబునాయుడు సూచించారు. సభ నుండి సస్పెన్షన్‌కు గురైన వెనుకంజ వేయకూడదని చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో సోమవారం ఉదయం టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని కేంద్రానికి తెలిసేలా చేయాలని బాబు పార్టీ ఎంపీలకు సూచించారు. వైసీపీ ఏ రకంగా ప్రజలను మోసం చేస్తోందనే విషయాలను వివరించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. కేంద్రంపై విశ్వాసం ఉందని చెబుతూనే అవిశ్వాసం పెడతామనే నాటకాలను ప్రజలకు వివరించాలని బాబు చెప్పారు.
ఏపీకి ఇచ్చిన హమీల అమలులో ఏ రకంగా అన్యాయం చేశారనే విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బాబు సూచించారు. రాష్ట్రానికి న్యాయం కోసం ఇతర పార్టీల నేతలతో కలిసి పోరాటం చేయాలన్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఎంపీలతో ప్రస్తావించారు. కేంద్రంపై, ప్రధానమంత్రిపై తమకు విశ్వాసం ఉందని విజయసాయిరెడ్డి అన్నట్టుగా మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను బాబు ఎంపీలతో ప్రస్తావించారు. మోడీపై విశ్వాసం ఉంటే ఎంపీలతో ఎందుకు రాజీనామాలు చేయాలని భావిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంపై ఎందుకు అవిశ్వాసం పెట్టాలని ముందుకువచ్చారో చెప్పాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి ఎందుకు వైదొలగాల్సి వచ్చిందనే విషయమై పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాజీ కేంద్ర మంత్రులు ఆశోక్ ‌గజపతి రాజు, సుజనాచౌదరిలకు సూచించారు. కేంద్రం నుండి వైదొలగాల్సిన పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పార్లమెంట్‌లో వివరించాలని బాబు సూచించారు. ఈ మేరకు పార్లమెంట్ ఉభయసభల్లో ఇద్దరు మాజీ కేంద్రమంత్రులు తమ రాజీనామాలకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు నోటీసులిచ్చారు.