Kireeti busy with interviews after elimination from Bigg Boss. He comments on Nani
#BiggBoss
బిగ్ బాస్ రెండవ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే షో నుంచి ముగ్గురు సభ్యులు ఎలిమినేటి అయ్యారు. తొలి రెండు వారాల్లో సామాన్యులుగా ఉన్న సంజన, నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ జరిగేకొద్దీ ఆడియన్స్ లో షో పై ఆసక్తి పెరుగుతోంది. మూడవ వారంలో నటుడు కిరీటి ఎలిమినేట్ అయ్యారు. షో నుంచి ఎలిమినేట్ అయిన కిరీటి ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. తనకు షో నుంచి ఎలిమినేట్ కావడం భాద కలిగించలేదని, ఇప్పుడు తన సినిమాలు తాను చేసుకుంటానని చెబుతున్నాడు.
బిగ్ బాస్ లో నిజాయితీపరుడు ఎవరనే ప్రశ్నకు కిరిటీ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. బిగ్ బాస్ లో నాని మాత్రమే నిజాయతీ పరుడని సమాధానం ఇచ్చాడు.
బిగ్ బాస్ షో విజయవంతంగా నడపడానికి 400 మంది పనిచేస్తున్నారని కిరీటి తెలిపారు. ఇక కుట్రలు చేసే సమయం ఎక్కడ ఉంది. ఇది రియాలిటీ గేమ్ షో మాత్రమే అని, ఎవరికీ తగ్గట్లు వారు ఆడుతారని కిరీటి తెలిపారు.
బిగ్ బాస్ 2 టైటిల్ గెలిచే అవకాశం చాలా మందికి ఉందని కానీ, ఆస్థాయిలో సత్తా మాత్రం తేజస్వికి ఉందని కిరీటి తెలిపాడు. ఆ అమ్మాయి పాములతో ఆడుకుని వచ్చిందని బిగ్ బాస్ షో లెక్క కాదని కిరీటి తెలిపాడు.