Surprise Me!

ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి జగన్‌: రామకృష్ణ

2018-07-04 339 Dailymotion

విశాఖపట్నం:సామాన్యులు కూడా అధికారం చేపట్టేలా జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీలే ఎందుకు ఉండాలి...మూడో ప్రత్యామ్నాయం ఎందుకు రాకూడదని ఆయన ప్రశ్నించారు. కామ్రేడ్‌ నీలం రాజశేఖరరెడ్డి శతజయంతి సభ మంగళవారం విశాఖ లోని సీపీఐ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ...చంద్రబాబు దిగిపోతే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాలని జగన్‌ రెడీగా ఉన్నారన్నారు. కానీ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి సీఎం అయితే...అవినీతిపరులపై ఎలా చర్యలు తీసుకోగలరని రామకృష్ణ ప్రశ్నించారు.

Common man has to take the power in centre and state politics said CPI state secretary K.Ramakrishna. Why should only TDP and YCP...Why should not a third alternative come up?...he questioned.
#andhrapradesh
#visakhapatnam
#cpiramakrishna
#tdp
#ycp
#CPI