India has asked its citizens to avoid all non-essential travel to Iraq amid rising tension between Iran and the US
#IranvsUSA
#Iran
#Iraq
#USmilitaryForces
#QassemSuleimani
#IndiansInIraq
#DonaldTrump
ఇరాక్ అమెరికా మధ్య యుద్ధవాతావరణం అలుముకుంది. ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసింను అమెరికా వైమానిక దళాలు దాడులు చేసి మట్టుబెట్టడంతో ఇరాన్ ప్రతీకారచర్యలకు దిగింది. ఇందులో భాగంగానే ఇరాన్ అమెరికా బలగాలు ఉన్న స్థావరంపై క్షిపణి దాడితో విరుచుకు పడింది. ఈ దాడిలో 80 మంది మృతి చెందినట్లు సమాచారం. 80 మంది మృతి చెందారనే వార్తను ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. మృతుల సంఖ్యపై కచ్చితమైన సమాచారం లేదా అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదిలా ఉంటే అమెరికా బలగాలకు క్షిపణి దాడిపై ముందస్తు సమాచారం ఉండటంతో అక్కడి నుంచి అమెరికా బలగాలు మరో చోటికి మారినట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం మంచి ఫలితాన్ని ఇచ్చిందంటూ అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.