Ramoji Rao Commemorative Meeting : రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సభలో దివంగత రామోజీరావు సేవలను మంత్రులు కొనియాడారు. తెలుగువారికి ఎప్పుడు కష్టం వచ్చినా రామోజీ అండగా నిలబడ్డారని తెలిపారు. రామోజీరావు వ్యక్తిత్వం ప్రజలకు స్ఫూర్తి దాయకమని వెల్లడించారు. రాజధాని అమరావతి పేరును పెట్టడంలోనూ ఆయన కృషి ఉందని గుర్తుచేశారు.