DY CM Bhatti visited Farmer family : ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను మృతుడి తండ్రిని అడిగి తెలుసుకున్నారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభాకర్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి సమస్యకూ ఓ పరిష్కరమార్గం ఉంటుందని అన్నదాతలెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన కోరారు.