Police Enquiry Fast Moving on PCB Files Burnt Case : పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన కీలక దస్త్రాలు, ఫైల్స్ దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టారు. కార్యాలయంలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందిని లోతుగా విచారణ చేశారు. దస్త్రాలు, హార్డ్డిస్క్లు బయటికి వెళ్లటంలో అధికారుల పాత్రను ఆరా తీశారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే సిబ్బంది వాంగ్మూలాలను సైతం రికార్డు చేశారు.