Surprise Me!

పిడుగురాళ్లలో అతిసార విజృంభణ-స్థానికులు సతమతం

2024-07-11 136 Dailymotion

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వారం రోజులుగా డయేరియా విజృంభిస్తోంది. రోజురోజుకూ వాంతులు, విరోచనాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో జిల్లా వైద్యాధికారులు నివారణ చర్యలపై దృష్టి సారించారు. స్థానికంగా వైద్యం అందించడంతోపాటు మెరుగైన ఆరోగ్యం కోసం బాధితులను నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరు ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించి అతిసారం కట్టడి చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ ఆరుమందిని అతిసారం బలి తీసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.