Surprise Me!

భద్రాచలం వద్ద 40.8 అడుగులకు గోదావరి నీటిమట్టం

2024-07-21 505 Dailymotion

Godavari Water Level Reaches 40.8 Feet At Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. శనివారం 34 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయానికి 36 అడుగులకు చేరింది. అలాగే మధ్యాహం 3 గంటలకు 40.8 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. భద్రాచలంలో ప్రస్తుతం 40.8 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరిలో వరద నీరు పెరగడంతో భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరదనీటిలో మునిగిపోయాయి.