Kidney Disease Problems Afflicting Tribals in NTR District : ఐదేళ్లలో వైఎస్సార్సీపీ సర్కార్ నిర్లక్ష్యం తండా వాసులకు శాపంలా మారింది. స్వచ్ఛమైన కృష్ణా జలాల తరలింపు ప్రాజెక్టు జాప్యం కారణంగా కిడ్నీవ్యాధితో తండాల్లో మరణాలు పెరిగాయి. ఇటీవల వామపక్షాల ఆందోళనతో సమస్య పరిష్కారంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం త్వరితగతిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.