Surprise Me!

సూర్యపేట, ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

2024-09-03 1 Dailymotion

CM Tour In khammam : వరద విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణను కేంద్రం ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల ధాటికి 5వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా ఉందని ఆ మొత్తాన్ని రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. నష్టపోయిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడిన ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. ప్రతిపక్ష పార్టీ వరదలతో బురద రాజకీయం చేస్తుందని మండిపడ్డారు..