Surprise Me!

మళ్లీ రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు

2024-10-16 5 Dailymotion

Group-1 Candidates Protest : గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ హైదరబాద్​ అశోక్​ నగర్​లో ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. నగరంలో గ్రూప్స్‌ అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఈ నెల 21 నుంచి జరగనున్న టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఎగ్జామ్స్​ వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో జరిగిన ప్రిలిమ్స్‌ పరీక్షలో తప్పులు, జీవో 29ను సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న క్యాండిడేట్లను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10మందిని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్‌ ఠానాకు తరలించారు.