CM Chandrababu Meeting With TDP Leaders : టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశానికి దాదాపు 25 మంది గైర్హాజరవ్వడంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు కేంద్ర మంత్రులు సహా పలువురు సమావేశానికి రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై వారం రోజుల ముందే షెడ్యూలు విడుదల చేస్తామని తెలిపారు. నాయకులకు ఎన్ని పనులు ఉన్నా, ఏస్థాయి నాయకులైనా సరే తప్పకుండా సమావేశానికి రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.