Dokka Manikya Vara Prasad Comments: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరస్వతి పవర్ కంపెనీకి కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో పరిశ్రమ పేరిట రైతులు, ప్రజల నుంచి వందలాది ఎకరాలను తీసుకుని, 15 ఏళ్లు గడుస్తున్నా నేటి వరకూ పరిశ్రమ స్థాపించలేదని ఆరోపించారు. ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఆ భూముల్ని రైతులకు కౌలుకు ఇచ్చే దిశగా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే నూతన పారిశ్రామిక వేత్తలకు కేటాయిస్తే పరిశ్రమలు వచ్చి, ఉపాధి పెరుగుతోందన్నారు.