Union Budget 2025 : డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదానికి అనుగుణంగానే ఏపీ జీవనాడిగా ఉన్న పోలవరానికి కేంద్ర పద్దులో వరుసగా రెండో ఏడాదీ కేటాయింపులు దక్కాయి. బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు గత సంవత్సరం కన్నా రూ.242 కోట్లు అదనంగా మొత్తం రూ.5936 కోట్లు కేటాయించింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత మొదటిసారి ఇంత మొత్తంలో నిధులు కేటాయించడంతో పనులు పరుగులు పెట్టిచేందుకు ఉపయోగపడుతుంది.