Quantum Valley in Amaravati : అమరావతి కేంద్రంగా 2026 జనవరి ఒకటి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దేశంలోనే మొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కును అమరావతిలో నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి కీలక ఒప్పందాలు చంద్రబాబు సమక్షంలో జరిగాయి.