Surprise Me!

శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

2025-05-21 35 Dailymotion

Tata Group Chairman in TTD : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో టాటా గ్రూప్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, మాజీ మంత్రి రోజా, నటి రవళి, నటులు ఆది, అశ్విన్, సంగీత దర్శకులు తమన్​లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వీరు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.