Single Elephant Attack on Forest Officer in Chitoor District: చిత్తూరు జిల్లా పలమనేరులో ఒంటరి ఏనుగు విధ్వంసం సృష్టించింది. ఉదయం 6 గంటలకు జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు సుమారు 5 గంటలసేపు ఫారెస్ట్ అధికారులకు చుక్కలు చూపెట్టింది. హైవే పక్కనే తిష్ట వేయడంతో ఏనుగును చూడడానికి పట్టణ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. మరోవైపు పక్కనే ఉన్న నివాస గృహస్థులు భయాందోళన చెందారు. మొదటగా చిన్నూరు బ్రిడ్జి సత్యనారాయణ గుడి వద్ద నుండి గంగవరం వైపు వెళ్తుండగా అడవిలోకి మళ్లించే ప్రయత్నం చేసిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్పై ఏనుగు దాడి చేసింది. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు తీవ్రంగా గాయమైంది. సుమారు 5 గంటల నిరీక్షణ తర్వాత ఏనుగును బాణసంచా పేలుస్తూ గంగవరం నుండి గంటావురు ఆంజనేయ స్వామి ఆలయం వెనక ఉన్న అడవిలోకి అటవీ అధికారులు తరలించారు. ఫారెస్ట్ సెక్షన్ అధికారి సుకుమార్కు కాలు విరగడంతో అటవీశాఖ అధికారులు ఆస్పత్రికి తరలించారు.