Surprise Me!

చెట్ల పొదల్లో పేకాట - డ్రోన్​ను చూసి పరుగులు పెట్టిన జూదగాళ్లు

2025-09-20 17 Dailymotion

Guntur Police Use Drone to Catch Gambling Gang: గుంటూరు జిల్లాలో పేకాటరాయుళ్లపై పోలీసులు కొత్త పంథా అవలంబించారు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో రైల్వే ట్రాక్ సమీపంలోని చెట్ల పొదల్లో పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే తెనాలి గ్రామీణ ఎస్సై ఆనంద్ తన సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరా సహాయంతో ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు. డ్రోన్ కెమెరా దృష్టికి 17 మంది పేకాట ఆడుతూ కనిపించారు. 

డ్రోన్ ​పైన తిరుగుతుండటాన్ని గమనించిన వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. పొలం గట్ల వెంట పారిపోవడానికి ప్రయత్నించిన వారిలో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు మాత్రం పరారయ్యారు. అడుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి పోలీసులు రూ.1,62,450 నగదుతో పాటు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఆనంద్ మాట్లాడుతూ, పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల వినూత్నంగా డ్రోన్ సహాయంతో జూదగాళ్లను గుర్తించి పోలీసులు పట్టుకుంటున్న విషయం తెలిసిందే.