Surprise Me!

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - స్వాగతం పలికిన ఆలయ అధికారులు

2026-02-24 6 Dailymotion

MLA kishore kumar Visits Tirumala Temple : తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి, పాండిచ్చేరి ప్రభుత్వ విప్ ఆర్ముగం, సినీనటి రవీనా టాండన్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసారు. 

సర్వదర్శనానికి 18 గంటల సమయం: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,803 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 27,766 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు వచ్చింది.