Telugu Desam Party New Executive Committee Swearing-in Ceremony: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు. పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో సీఎం చంద్రబాబు ప్రమాణం చేయించారు. టీడీపీ అధినాయకత్వం పాత-కొత్త కలయికతో కమిటీలను ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు చంద్రబాబు, లోకేశ్ పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని నిజం చేస్తూ పని చేసిన వారికే కమిటీల్లో పెద్ద పీట వేశారు. 44 ఏళ్ల తర్వాత కూడా పార్టీకి సరికొత్త రూపం వచ్చేలా టీడీపీ కమిటీల నియామకం చేపట్టింది.
బాధ్యతల స్వీకారం: సీనియర్ల సారథ్యం, జూనియర్ల దూకుడును సమపాళ్లల్లో కలుపుతూ కమిటీల నియమించారు. కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్, గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి హైలెట్గా నిలుస్తోందన్నారు. గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా పని చేసిన వారికి కమిటీలో చోటు కల్పించారు. ఎన్టీఆర్, చంద్రబాబు అధ్యక్షులుగా ఉన్నప్పుడు లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు స్వీకరిస్తున్న కమిటీల్లోనూ యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి కీలక బాధ్యతలు చేపట్టారు.