Surprise Me!

'అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి' - మచిలీపట్నంలో సైకిల్‌పై కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

2026-05-02 1 Dailymotion

krishna District Collector D.K. Balaji Tours Machilipatnam on Bicycle: కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో సైకిల్‌పై సుడిగాలి పర్యటన చేశారు. సిబ్బందితో కలిసి సైకిల్‌ తొక్కుతూ పలు డివిజన్లను పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా గ్రీన్ స్పాట్‌లను సందర్శించారు. అక్కడ చెత్తా, చెదారం ఉండటంతో సచివాలయ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ స్పాట్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్య పనులు సరిగ్గా జరగడం లేదని, ఇకనైనా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. వార్డు సచివాలయ సిబ్బందికి పారిశుద్ధ్య పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినప్పటికీ సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరాన్ని స్వచ్ఛంగానూ, సుందరంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించేది లేదని నిరంతరం తనిఖీ చేస్తుంటానని కలెక్టర్ స్పష్టం చేశారు. 

స్వచ్ఛ సర్వేక్షణ్‌: పట్టణ పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మల, మూత్ర విసర్జనరహిత పట్టణాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రతీ యేడు స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది. పట్టణాల్లో నివసించే పౌరుల నుంచి తమ పరిసరాల శుభ్రతపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.