Surprise Me!

రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఎండ - అనారోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు రావొద్దంటున్న వైద్యులు

2026-05-04 3 Dailymotion

 Heat Waves And Effects In State : వేసవి ఎండలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బెజవాడలో ప్రజల జీవితాలను మండుటెండ దుర్భరం చేస్తోంది. ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. అవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్​ విజయ్‌ చైతన్య, గుండె వైద్య నిపుణుడు, డాక్టర్​ సమరం, జనరల్‌ ఫిజీషియన్‌ ప్రజలకు సూచించారు. 

ఈ తీవ్రమైన వేడి ప్రజలను అనేక కష్టాలకు గురిచేస్తోంది. అన్ని వయసుల వారు ఈ పరిస్థితులను తట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా ఇది వేసవి కాలం కాబట్టి చిన్నపిల్లలు , దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వేడిని తట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) నివారించడానికి తరచుగా నీరు తాగాలని వారు సూచిస్తున్నారు. అదనంగా శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడే ఆహార పదార్థాలను తీసుకోవాలంటున్నారు. ప్రతిరోజూ 3 నుంచి 4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలని వైద్యులు సూచించారు.