Surprise Me!

ఇంద్రకీలాద్రిపై హుండీ లెక్కింపు - 16 రోజుల్లో రూ.3.41 కోట్ల ఆదాయం

2026-06-03 0 Dailymotion

Indrakeeladri Hundi Income : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. గత నెల 18వ తేదీ నుంచి 16 రోజుల పాటు వచ్చిన హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు తాజాగా లెక్కించారు. ఈవో శీనానాయక్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. కేవలం ఈ 16 రోజుల్లోనే అమ్మవారికి రూ.3,41,39,565 నగదు రూపంలో ఆదాయం వచ్చింది. అలాగే నాణేల ద్వారా మరో రూ.15,53,000 సమకూరాయి. వీటితో పాటు 273 గ్రాముల బంగారం, 4.45 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. రోజువారీ సగటు చూసుకుంటే సుమారు రూ.21 లక్షలకు పైగా ఆదాయం రావడం విశేషం.

విదేశీ భక్తులు సైతం అమ్మవారికి కానుకలు సమర్పించడంలో ముందున్నారు. వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు హుండీల్లో లభ్యమయ్యాయి. ప్రధానంగా 349 అమెరికన్ డాలర్లు, 1390 యూఏఈ దిర్హమ్స్, 5 వేల సిరియన్ పౌండ్లు కానుకలుగా వచ్చాయి. వీటితో పాటు 335 నేపాల్ రూపాయలు, 195 కెనడా డాలర్లు కూడా ఉన్నాయి. ఇంకా రష్యా, సింగపూర్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాతో కలుపుకుని మొత్తం 15 దేశాల కరెన్సీని విదేశీ భక్తులు హుండీలో వేశారు. ఈ మేరకు ఆలయ అధికారులు వివరాలను వెల్లడించారు.