Surprise Me!

ఇక్కడికి వచ్చి చూస్తే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో తెలుస్తుంది: మంత్రి నారాయణ

2026-06-04 0 Dailymotion

Amaravati Works Inspection : రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జిలు, వాగుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. ట్రంక్ రోడ్లపై 43, ఎల్పీఎస్ జోన్లలో 32 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామన్నారు. వర్షాకాలంలో కొండవీటి వాగు ప్రవాహానికి ఇబ్బంది లేకుండా మట్టి తొలగిస్తున్నారని తెలిపారు. శాఖమూరు, పెనుమాక, నీరుకొండ రిజర్వాయర్లలో సగం పని పూర్తయిందన్నారు. భారీ వర్షాలు వస్తే పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అన్నారు. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ కొండవీటి వాగు అభివృద్ధి పనులను పరిశీలించారు. N9, N8, N7 రోడ్లలో కొండవీటి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిల పనులను పరిశీలించారు. బ్రిడ్జిల కింద కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం లేకుండా మట్టి తొలగించాలని అధికారులను ఆదేశించారు. కొండవీటి వాగు వెడల్పు తక్కువగా ఉన్నచోట మరింత వెడల్పు చేయాలని సూచించారు.

రైతులను వైఎస్సార్సీపీ రెచ్చ కొడుతోందని మంత్రి నారాయణ ఆరోపించారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని వైఎస్సార్సీపీ చూస్తోందని మండిపడ్డారు. అమరావతిపై వైఎస్సార్సీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందని మంత్రి అన్నారు. రైతుల భూములు వెనక్కి తిరిగి ఎలా ఇచ్చేస్తారని నిలదీశారు. భవనాలు, రోడ్లు, పైపు లైన్​ల నిర్మాణం పూర్తయ్యాక భూములు ఇవ్వడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. మాజీ సీఎంగా చేసిన వ్యక్తి అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారని మంత్రి నారాయణ మండిపడ్డారు.