Mokhagna Teja Visits Tirumala : నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ (VIP) బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ (TTD) అధికారులు ఆయనకు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం, ఆయన ఆలయంలో మూలవిరాట్టును దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలతోపాటు తీర్థ-ప్రసాదాలు అందజేశారు.
సర్వ దర్శనం కోసం 24 గంటల సమయం : టోకెన్లు లేని భక్తులు తిరుమలలో శ్రీవారి 'సర్వ దర్శనం' కోసం 24 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో 'శిలా తోరణం' వరకు వేచి ఉన్నారు. శుక్రవారం 74,128 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే, నిన్న ఆలయ హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చింది. 36,053 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.