Surprise Me!

'అగ్గిపెట్టెలో పట్టే శాలువా' - కొండగట్టు ఆంజన్నకు సమర్పించిన సిరిసిల్ల చేనేత కళాకారుడు

2026-06-30 2 Dailymotion

Kondagattu Hanuman Temple : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామికి సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్ అద్భుతమైన పట్టు శాలువాను బహుకరించాడు. ఈ శాలువా ప్రత్యేకత ఏమిటంటే అగ్గి పెట్టెలో ఇమిడిపోతుంది. దీనిని హరి ప్రసాద్​ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, మృదువుగా, సూక్ష్మంగా తానే స్వయంగా తయారు చేశారు. ఈ శాలువా సన్నని పట్టుదారాలతో, ప్రత్యేక శ్రద్ధతో తయారు చేయడం వల్ల చూపరుల కనులకు ఆకట్టుకుంటుంది. స్వామి వారిని దర్శించుకున్న చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టు శాలువాను ఆంజనేయ స్వామికి సమర్పించారు. సిరిసిల్ల చేనేత కళాకారుల నైపుణ్యాన్ని అద్దం పట్టేలా తయారు చేసిన శాలువా ఆలయంలో ప్రత్యేకంగా నిలిచింది. హరి ప్రసాద్ శాలువాను స్వామికి సమర్ఫించిన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అరుదైన కానుకను సమర్పించిన హరి ప్రసాద్​ కుటుంబ సభ్యులను పండితులు ఆశీర్వహించారు.