Surprise Me!

శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటి సీఎం సతీమణి - భర్త త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు

2026-07-18 3 Dailymotion

Deputy Cm Wife Visits Tirupati: తిరుమల శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం రాత్రి ఆమె కాలినడకన తిరుమల చేరుకున్నారు. అలిపిరి మెట్లన్నీ ఎక్కి చివరి మెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అన్నా లెజినోవాకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.ఆ తర్వాత ముందుగా శ్రీభూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 గుండా ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ డిప్యూటీ ఈవో ఆర్‌-1 భాస్కర్‌ ఆమెకు స్వాగతం పలికి, ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గంలో మూలమూర్తి దర్శనం చేయించారు. 

రంగనాయకుల మండపంలో పండితులు లెజ్‌నోవాకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత అఖిలాండం వద్ద స్వామివారికి కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించారు. బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకొని తిరుగుపయనమయ్యారు. ఇటీవల పవన్‌ భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆమె తిరుమల చేరుకుని మొక్కు తీర్చుకున్నారు.