Cyber Expert On Reduction On Cyber Crime In Future : రాష్ట్రంలో సైబర్ నేరాల కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రభుత్వం పోలీసులను ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరడంతో పాటు, అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఈ సైబర్ నేరాలను ఇప్పుడే అరికట్టకపోతే భవిష్యత్తులో వాటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాలను నియంత్రించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సైబర్ నిపుణులు నొక్కి చెబుతున్నారు. సైబర్ నేరాల సమస్యలపై అధ్యయనం చేయడం ప్రధాన లక్ష్యంగా విజయవాడలో గత రెండు రోజులుగా "ఫ్యూచర్-రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్" (Future-Ready AP Police Retreat) జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రానికి ఒక సానుకూల పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. AI, డీప్ఫేక్ (deepfake) సాంకేతికతలతో కూడిన సైబర్ మోసాలను అరికట్టడానికి AI సాధనాలను వినియోగించాలని ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ సాయి చరణ్ సూచిస్తున్నారు.