Union Minister Kishan Reddy Demands the Resignation of Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ పై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరీక్షా పేపర్ల లీక్లు సర్వ సాధారణమని మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల అక్రమాల నిరోధక బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడితే చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. జంతర్ మంతర్లో విద్యార్థుల ఆందోళనలో విధ్వంసం ఎందుకు జరగలేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బాధపడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ సింగరేణి వ్యతిరేక విధానాలు అవలంభించారని, కొత్త బొగ్గుబ్లాక్ల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా కేసీఆర్ అడ్డుకున్నారని, ఆనాడు కేసీఆర్ అవలంభించిన వైఖరి వల్ల సింగరేణికి కొత్త బ్లాక్లు లేకుండా పోయాయని ఆరోపించారు.