ETV Exclusive Interview With Home Minister Anitha On Bhogapuram International Airport : ఉత్తరాంధ్ర అంటే వెనకబడిన ప్రాంతం కాదు రాష్ట్రానికే వెన్నెముక అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేళ దాదాపు 4 వేల మంది పోలీసుల బలగాలతో భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాదాపు 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశముందని, వారిని తిరిగి ఇంటికి క్షేమంగా పంపించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్విజిబిల్ పోలీసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎయిర్ పోర్ట్ ప్రారంభానికి ముందు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చి వైఎస్ జగన్ తన సైకోయిజాన్ని బయటపెట్టుకున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు వచ్చినా తమ క్రెడిట్గా చెప్పుకోవడం జగన్కు అలవాటుగా మారిందంటున్న హోంమంత్రి అనితతో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.