Surprise Me!

ఉత్తరాంధ్ర చరిత్రను తిరిగరాసే ఘట్టం - కదిలివచ్చిన ఊరువాడా

2026-08-01 7 Dailymotion

Bhogapuram Airport inauguration : ఉత్తరాంధ్ర చరిత్రను తిరిగరాసే మహోత్తర ఘట్టంలో భాగస్వాములయ్యేందుకు ఊరువాడా కదలివచ్చాయి. భోగాపురం జన సంద్రమైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేళ ప్రజల అడుగులన్నీ భోగాపురం వైపే పడ్డాయి. బస్సులన్నీ ఆ వైభోగాపురానికే కదలివచ్చాయి. చారిత్రాత్మకమైన ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. దీంతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. భోగాపురానికి వచ్చే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. వేలాది బస్సులు బారులు తీరాయి. వాహనం ఏదనే తేడా లేకుండా ఏది దొరికితే అది పట్టుకొని భోగాపురం చేరుకున్నారు. పండుగ వాతావరణంలో జరిగిన ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వామలయ్యారు. ఎటుచూసినా జన సందోహమే, పండుగ వాతావరణమే. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సహా అతిరథులంతా తరలివచ్చిన సభ అశేష జనవాహినితో నిండిపోయింది. విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భంగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 13,750 మంది నృత్యం చేసి ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు థింసా నృత్యంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చిన వేళ థింసా నృత్యాలతో భోగాపురం పులకించిపోయింది.