GMR Chairman Grandhi Mallikarjuna Rao Interview : ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం గేట్వేలా నిలుస్తుందని జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు అన్నారు. ఉత్తరాంధ్ర సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తూ ఈ విమానాశ్రయాన్ని డిజైన్ చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్లో పనిచేసిన వారిలో చాలా మంది ఉత్తరాంధ్రకు చెందిన వారే అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలు అనుసరించడం వల్లే ఇంత అద్భుతం సృష్టించగలిగామన్నారు.
ఆర్థిక ప్రగతికి సోపానం : అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు, చక్కటి వాతావరణం, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లకు ఇక్కడ ఎటువంటి లోటు లేదని గ్రంధి మల్లికార్జునరావు పేర్కొన్నారు. ఈ నెల 17న మన్యం వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణ జరుగుతుందన్నారు. మెరుగైన ప్రమాణాలతో ప్రయాణ సేవలందిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఈ విమానాశ్రయం సోపానంగా నిలుస్తుందంటున్న జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావుతో ముఖాముఖి.