Surprise Me!

కడప జిల్లాలో ఏనుగులు హల్‌చల్‌ - డ్రోన్ ద్వారా జాడ కనిపెట్టిన అధికారులు

2026-08-07 2 Dailymotion

Elephants In Kadapa District : కడప జిల్లా సుండుపల్లి మండలంలో ఏనుగుల గుంపు పంటలను నాశనం చేస్తున్నాయి. గత కొంత కాలంగా శేషాచల అడవుల్లో తిష్ఠ వేసిన ఏనుగులు రాత్రిపూట పొలాల్లోకి చొరబడుతున్నాయి. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో అటవీ శాఖ సిబ్బంది మాచిరెడ్డిగారిపల్లి గ్రామం సహా రెడ్డివారిపల్లి అటవీ ప్రాంతంలో పర్యటించారు. డ్రోన్ ద్వారా ఏనుగుల జాడను తెలుసుకునేందుకు యత్నించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జిల్లాలోని సుందుపల్లి మండలం, ముడంపాడు గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు సనిపాయ, భకరపేట రేంజ్ అటవీ అధికారులు డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించారు. ఆ గుంపులో 13 ఏనుగులు ఉండగా, వాటిలో రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. పిల్ల ఏనుగుల సంచారాన్ని గుర్తించిన అటవీ అధికారులు వెంటనే అప్రమత్తమై, బాణసంచా కాల్చి పెద్ద శబ్దం చేశారు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న కటారిమడుగు, శివరాంపురం, నగరి, యానాది కాలనీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు.