CM Chandrababu Dance with Tribal People at Vijayawada : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి గిరిజనులు తమ సాంప్రదాయ కొమ్ము, బంజారా, థింసా నృత్యాలతో ఘనంగా, ఉత్సాహభరితంగా స్వాగతం పలికారు. అనంతరం ఆదివాసీ మహిళలు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలను సీఎం ఆసక్తిగా తిలకించారు. గిరిజన సంస్కృతి పై గౌరవంతో, మహిళల అభ్యర్థన మేరకు చంద్రబాబు వారితో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఉత్సవాల్లో భాగంగా అక్కడి డప్పు కళాకారులను ఉత్సాహపరుస్తూ సీఎం చంద్రబాబు స్వయంగా గిరిజన సాంప్రదాయ డప్పును వాయించారు. గిరిజనుల ఆచార వ్యవహారాలను కొనియాడిన ఆయన, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఆదివాసీ ప్రతినిధులు పాల్గొన్నారు.