Surprise Me!

వరుణయాగంలో సీఎం రేవంత్​ రెడ్డి దంపతులు

2026-08-10 2 Dailymotion

CM Revanth Reddy Attends Varuna Yagam : రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన 'వరుణయాగం'లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ విహార్ ప్రాంగణంలో జరిగిన ఈ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్, ఆయన సతీమణి గీత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు, వేద పండితుల పర్యవేక్షణలో ఈ యాగం జరిగింది. 11 హోమగుండాలు, 108 మంది రుత్వికులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, నీటి కొరత తొలగాలని, పంటలు బాగా పండి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ వరుణ దేవుని పూజ నిర్వహిస్తుంటారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి సస్యశ్యామలం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.