Tungabhadra reservoir flood levels : తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. గత వారం లక్ష క్యూసెక్కులకు పైగా వచ్చిన వరద ప్రస్తుతం 23వేల 290 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. వరద తగ్గినప్పటికీ తుంగభద్ర జలాశయంలోకి నెమ్మదిగా నీరు చేరుతుండటంతో నీటి నిల్వ 87.45 టీఎంసీలకు చేరింది. టీబీ డ్యాం గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1628 అడుగులకు నీరు వచ్చింది. జలాశయం నుంచి 2,266 క్యూసెక్కుల నీరు ఏపీ, కర్ణాటక రాష్ట్రంలోని కాలువలకు విడుదల చేస్తున్నారు. దీనిలో అనంతపురం హెచ్ఎల్సీ కాలువ ద్వారా 528 క్యూసెక్కులు, ఎల్ఎల్సీ ద్వారా 580 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. తుంగ, భద్ర నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గిపోవడంతో ప్రస్తుతం 70 శాతం పైగా వరద తగ్గి జలాశయంలోకి నీటి చేరిక తగ్గింది. రానున్న నాలుగు రోజల్లో వర్షాల కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ చెబుతోంది.