Surprise Me!

స్ఫూర్తిదాయక ఘటన: అమరావతి నిర్మాణానికి రూ.50 వేలు విరాళమిచ్చిన వృద్ధుడు

2026-08-22 2 Dailymotion

Old Man Donated Rs 50 Thousand For Amaravati Construction: అనకాపల్లి జిల్లా కె. కోటపాడు మండలం ఏ.కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్ఫూర్తిదాయక ఘటన చోటు చేసుకుంది. పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణానికి తన వంతు సహకారంగా రత్తయ్య అనే వృద్ధుడు తాను దాచుకున్న 50 వేల రూపాయలు విరాళంగా సీఎం చంద్రబాబుకు అందజేశారు. వయసు మీద పడినప్పటికీ, అమరావతి నిర్మాణం పూర్తి కావాలనే సదుద్దేశంతో రత్తయ్య ముందుకు రావడం అందరినీ ఆలోచింపజేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. 

రత్తయ్య తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. తన జీవితంలో కూడబెట్టుకున్న పొదుపు సొమ్మును ఏ మాత్రం వెనుకాడకుండా రాజధాని కోసం త్యాగం చేయడం ఆయనకు రాష్ట్రంపై ఉన్న మమకారానికి నిదర్శనం అని సీఎం అన్నారు. గతంలోనూ ఈయన ఇలాగే విరాళం ఇచ్చారని సీఎం గుర్తు చేశారు. విశ్వనాథం తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. సామాన్యుల నుంచి వస్తున్న ఇటువంటి సహకారాలు ప్రభుత్వానికి, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో నైతిక బలాన్ని ఇస్తాయన్నారు.