Surprise Me!

పెట్రోల్​లో నీళ్లు కలిపారంటూ బంక్​ వద్ద వాహనదారుడు ఆందోళన

2026-08-23 1 Dailymotion

Water Found in Petrol in Rangareddy Dist : పెట్రోల్‌లో నీళ్లు కలిపారని ఆరోపిస్తూ ఓ వినియోగదారుడు పెట్రోల్ బంక్‌ ముందు ఆందోళనకు దిగిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలో చోటుచేసుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంలో, పాలమాకులలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్ పోయించుకున్నాడు. బంక్ నుంచి కొద్ది దూరం వెళ్లగానే వాహనం ఆగిపోయిందని సమీపంలోని మెకానిక్ వద్దకు తీసుకువెళ్లి చూపించగా పెట్రోల్‌లో నీరు కలిసినట్లు చెప్పారన్నారు. పెట్రోల్​బంక్‌ వద్దకు వెళ్లి అడిగితే దాని యాజమాని బాధ్యతారహితంగా వ్యవహరించి తానే నీళ్లు కలిపినట్లుగా దబాయించాడని వాహనదారుడు తెలిపారు. ఆగ్రహానికి గురైన బాధితుడు శ్రీనివాస్, బంక్ ఎదుట ఆందోళనకు దిగాడు. అధిక ధరలు చెల్లించి కొంటున్న పెట్రోల్‌లో నీరు కలపడం దారుణమని, ఇలాంటి బంకులపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని వాహనదారుడు డిమాండ్ చేశారు. వాహనదారుడి ఆరోపణలపై పెట్రోల్​ బంకు యజమాని వివరణ ఇచ్చారు. తమ బంక్‌లో పెట్రోల్​లో నీరు కలవడం అనేది అవాస్తవమని పెట్రోల్​ బంక్ యజమాని తమీమ్ తెలిపారు. ఆరోపణలు అవాస్తవమన్నారు.