రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం ప్రస్తుతం యూఎస్ఏలో షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజతో పాటు ఇతర ముఖ్య తారాగణంపై మార్చి 26 నుండి ఇక్కడ షూటింగ్ ప్రారంభం అయింది. తొలుత న్యూయార్కులో కొన్ని సీన్లు చిత్రీకరించిన అనంతరం షూటింగ్ కాలిఫోర్నియాకు షిప్టయింది. కాలిఫోర్నియా సమీపంలోని లాంగ్ ఐలాండ్లో ప్రముఖ హాలీవుడ్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్కు సంబంధించిన భవనం పలాటియల్ హిడెన్ హిల్స్ మాన్షన్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ విషయాన్ని శ్రీను వైట్ల ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఎగ్జైట్మెంట్ వ్యక్తం చేశారు.