Surprise Me!

డ్రోన్ కెమెరాకు చిక్కిన పేకాట రాయుళ్లు - వేంపల్లిలో ఐదుగురి అరెస్ట్

2026-07-10 1 Dailymotion

Drone Catches Gamblers : కడప జిల్లా వేంపల్లి మండలం కత్తులూరు గ్రామంలో డ్రోన్ కెమెరా కంటికి ఐదుగురు జూదరులు అడ్డంగా దొరికిపోయారు. గ్రామంలోని చీని చెట్ల కింద పట్టాలు పరిచి జూదం ఆడుతున్నారు. వేంపల్లి సీఐ నరసింహులు ఆధ్వర్యంలో పోలీసులు ఆ ప్రాంతంపై దాడి చేసి, ఐదుగురు జూదరులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారి నుంచి రూ.8,990 నగదును సీజ్ చేసి, పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ నరసింహులు హెచ్చరించారు.