Surprise Me!

అమరావతికి 'తల్లికి వందనం' - విరాళం అందించేందుకు ముందుకొచ్చిన ఓ కుటుంబం

2026-07-24 5 Dailymotion

Cash Donation Towards Amaravati's Development Under The 'Thalliki Vandanam' Scheme : అమరావతిపై మమకారంతో రాజధాని అభివృద్ధి కోసం తల్లికి వందనం నగదును ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందించేందుకు ఇద్దరు చిన్నారులు, తల్లిదండ్రులు  ముందుకొచ్చారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని విద్యార్థుల కుటుంబం కలిసి విషయాన్ని తెలిపారు. 

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు గ్రామానికి చెందిన ఉప్పుటూరి హరికృష్ణ, సుస్మిత దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నారుల స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఉప్పుటూరి మహర్ష నంద ఐదవ తరగతి, ఉప్పుటూరి పునీత్ రాజ్ కుమార్ ఒకటో తరగతి చదువుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న తల్లికి వందనం నిధులను తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది. ఈ నేపథ్యంలో చిన్నారులకు రూ. 26 వేలు తల్లిదండ్రుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో చిన్నారుల నానమ్మ ఉప్పుటూరి రత్తమ్మ నగదును అమరావతి అభివృద్ధికి వారి కుటుంబ ఆర్థిక సాయంగా అందించేందుకు చిన్నారులను వెంట బెట్టుకొని మంత్రి బాలవీరాంజనేయస్వామిని శుక్రవారం కలిశారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి నగదు అందజేస్తామని తెలిపారు.